Fri May 23 2025 02:02:30 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ కు గుండెపోటు
బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురయ్యారు. ఆయన ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. రాజేంద్రప్రసాద్కు వెంటనే చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. బాబు రాజేంద్రప్రసాద్కు యంజోగ్రామ్ చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని వైద్యులు తెలిపారు. బాబు రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించడంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story