Fri Jan 30 2026 02:02:57 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
పసుమర్రి సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లా, పసుమర్రి సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు-టిప్పర్ ఢీ కొని చిన్నగంజాంకు చెందిన ఆరుగురు మృతి చెందడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు కోరారు.
గాయపడిన వారికి...
గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని ప్రకటించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సు దహనం ఘటన దురదృష్టకరమని చంద్రబాబు నాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Next Story

