Fri Dec 05 2025 17:44:59 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుమలకు నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు తిరుమలకు చేరుకున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేడు తిరుమలకు చేరుకునున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నారావారిపల్లెకు భువనేశ్వరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నారావారపల్లెలో భువనేశ్వరి తమ కులదేవతలకు పూజలు నిర్వహిస్తారు.
ఎల్లుండి నుంచి...
రేపటి నుంచి "నిజం గెలవాలి" కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించనున్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఆయన 44 రోజుల నుంచి రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ వార్త వినిన వెంటనే ఆవేదనతో గుండెపోటుతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి ఓదారుస్తారు. ఈ నెల 25వ తేదీన ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరికి సమీపంలోని అగరాలలో బహిరంగ సభ నిర్వహించి అందులో ప్రసంగిస్తారు.
Next Story

