Fri Dec 05 2025 13:34:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఎవరికీ రక్షణ లేదు
ఆంధ్రప్రదేశ్ లో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాగలక్ష్మి తనకు అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు ఉన్నాయని చెప్పిందన్నారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్సీకి కూడా ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. అయినా పోలీసులు పట్టించుకోక పోవడంతో నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు.
ఫిర్యాదు చేసినా....
ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందిచరా? ఇక పోలీసులు ఎందుకు ఉన్నట్లు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకంటే పోలీసులకు రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయని తీవ్ర విమర్శలు చేశారు. నాగలక్ష్మి ఆత్మహత్యపై విచారణ జరిపించాలని, అందుకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story

