Sun May 12 2024 00:44:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపు ఢిల్లీకి చంద్రబాబు... పొత్తులపై తేల్చుకునేందుకే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేనతో అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు బీజేపీతో కలసి ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు బీజేపీ నేతలతో సమావేశమవుతున్నారు.
సీట్ల సర్దుబాటు...
అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పంపకాలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. బీజేపీతో ఇప్పటికే జనసేన పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఆయన కూడా వెళ్లి పార్టీ పెద్దలను కలసి వస్తారని తెలిసింది. మూడు పార్టీలకు పొత్తు కుదిరితే త్వరలోనే సీట్లను సర్దుబాటు చేసుకుని జనంలోకి వెళ్లాలన్న నిర్ణయంతో చంద్రబాబు ఉన్నారు.
Next Story