Mon Dec 22 2025 23:50:30 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబుకు భారీ ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటీషన్ తో సుప్రీంకోర్టు విభేదించింది. జనవరి 10వ తేదీన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ ను కొట్టివేసింది.
బెయిల్ను రద్దు చేయాలంటూ...
ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు విచారించిన ధర్మాసనం ఆ కేసులో వేసిన పిటీషన్ను విభేదించింది. ఇదే కేసులో మిగిలిన నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
Next Story

