Sat Apr 20 2024 13:53:28 GMT+0000 (Coordinated Universal Time)
ద్రౌపది ముర్మును కలిసిన చంద్రబాబు
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ద్రౌపది ముర్మును చంద్రబాబు కలిశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ద్రౌపది ముర్మును చంద్రబాబు కలిశారు. గేట్ వే హోటల్ కు వచ్చిన ముర్మును చంద్రబాబు కలిసి వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు.
గిరిజన మహిళకు...
తెలుగుదేశం పార్టీ తొలి నుంచి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని చంద్రబాబు తెలిపారు. గిరిజన మహిళకు అత్యున్నత పదవి దక్కడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. తమ పార్టీ తరుపున ద్రౌపది ముర్ముకు అభినందనలను తెలుపుతున్నామని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు.
Next Story