Tue Jan 20 2026 20:37:59 GMT+0000 (Coordinated Universal Time)
కందుకూరు ఘటన : 23 లక్షల సాయం
కందుకూరు ఘటనపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు

కందుకూరు ఘటనపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కందుకూరులోనే ఉండి ఆయన పరిస్థిితిని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి 23 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని చంద్రబాబు నిర్ణయించారు.
పార్టీ నేతల నుంచి...
పార్టీ పరంగా ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు సాయం చేయాలని డిసైడ్ చేశారు. ఇక టీడీపీ నేతలు తమ వంతుగా ఒక్కొక్క కుటుంబానికి ఎనిమిది లక్షల సాయం చేస్తామని తెలపడంతో మొత్తం 23 లక్షల రూపాయల సాయాన్ని కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు అందచేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
Next Story

