Fri Dec 05 2025 11:02:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తాం
రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు

రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. మరోవైపు పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నామని ఆయన తెలిపారు. టీడీపీ మూడో జాబితాను విడుదల చేసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు
ఆశీర్వదించాలంటూ...
పార్లమెంటుకు పోటీ చేసే పదమూడు మంది తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులను, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని తెలిపారు.. ప్రజలారా ఆశీర్వదించండి అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో కోరారు.
Next Story

