Tue Jan 20 2026 22:40:33 GMT+0000 (Coordinated Universal Time)
జోగి రమేష్ కు నోటీసులు.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో
మాజీ మంత్రి జోగిరమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఆయనకు నోటీసులు ఇచ్చారు

మాజీ మంత్రి జోగిరమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. ఈరోజు విచారణకు రావాలని జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
చంద్రబాబు నివాసంపై...
అయితే జోగి రమేష్ మాత్రం తాను ఈరోజు సాయంత్రం విచారణకు వస్తానని చెప్పారు. వైసీీపీ అధికారంలో ఉన్నప్పడు జోగి రమేష్ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి నివాసం వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ కేసు విషయంలోనే జోగి రమేష్ కు తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Next Story

