Thu Dec 18 2025 23:01:00 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని కేసులపై...?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై సుప్రీం కోర్టులో జులై 11న విచారణ జరగనుంది

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై సుప్రీం కోర్టులో జులై 11న విచారణ జరగనుంది. చనిపోయిన పిటిషనర్ల స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువురు రైతులు ఎల్ఆర్ అప్లికేషన్ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
త్రిసభ్య ధర్మాసనం...
జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. రాజధాని అమరావతి కేసును గత విచారణలో ధర్మాసనం జులై 11కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Next Story

