Sun Mar 08 2026 02:39:21 GMT+0530 (India Standard Time)
క్లోరిన్ గ్యాస్ లీకై 10 మంది విద్యార్థులకు అస్వస్థత
స్థానిక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ గ్యాస్ లీకైంది. ఆ సమయంలో పూల్ లో ఉన్న విద్యార్థులంతా..

క్లోరిన్ గ్యాస్ లీకై 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో చోటుచేసుకుంది. స్థానిక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో క్లోరిన్ గ్యాస్ లీకైంది. ఆ సమయంలో పూల్ లో ఉన్న విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 7, బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఉన్నట్టుండి కళ్లు తిరగడం, సొమ్మసిల్లడంతో విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులంతా 8-14 ఏళ్ల వయసులోపు వారని వైద్యులు తెలిపారు. గ్యాస్ లీకైన సమయంలో విద్యార్థులంతా 50–మీటర్ల పూల్ లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ట్యాంకర్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 11న ఏలూరులో జరగనున్న స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం వీరంతా సిద్ధమవుతున్నారు.
Next Story

