Sat Jul 27 2024 01:54:48 GMT+0000 (Coordinated Universal Time)
యువశక్తి సభలో లాఠీఛార్జి
శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో తోపులాట జరిగింది. పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చిన కార్కకర్తలు ముందుకు తోసుకువచ్చారు.
![యువశక్తి సభలో లాఠీఛార్జి యువశక్తి సభలో లాఠీఛార్జి](https://www.telugupost.com/h-upload/2023/01/12/1457502-janasena.webp)
శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో తోపులాట జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చిన వెంటనే కార్కకర్తలు ముందుకు తోసుకువచ్చారు. బారికేడ్లను తోసుకు వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు.
పోలీసులపై తిరగబడటంతో...
కార్యకర్తలను పలుమార్లు ఆగాలని చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఓ కార్యకర్త ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల మీద కార్యకర్తలు తిరగబడ్డారు. గాయపడిన కార్యకర్తకు చికిత్స అందించేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story