Sun Feb 01 2026 14:26:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. తమకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే టీడీపీకి పదిహేడు నిమిషాల సమయాన్ని మాత్రమే స్పీకర్ కేటాయించారు.
9 మంది సభ్యులపై...
ఈ సమయం సరిపోదని, మరింత సమయం కావాలంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు టీడీపీ సభ్యులను సప్పెండ్ చేశారు. టీడీపీకి చెందిన మొత్తం తొమ్మిది సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story

