Tue Jan 20 2026 20:11:52 GMT+0000 (Coordinated Universal Time)
పెగాసస్.. హౌస్ కమిటీ.. భూమన ఛైర్మన్ గా
పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల హౌస్ కమిటీని స్పీకర్ ప్రకటించారు

పెగాసస్ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇటీవల హౌస్ కమిటీని స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో స్పీకర్ తమ్మినేని హౌస్ కమిటీని ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ గా హౌస్ కమిటీని నియమించారు.
సభ్యులుగా .....
సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, పార్థసారధి, అమర్నాధ్, మేరుగ నాగార్జున, మద్దాలి గిరిధర్ ని నియమిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెగాసస్ స్పైవేర్ ను అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆరోపణలు విన్పించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా చంద్రబాబు పెగాసస్ ను కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ దీనిపై విచారణకు హౌస్ కమిటీని నియమించారు.
Next Story

