Fri Dec 05 2025 22:05:13 GMT+0000 (Coordinated Universal Time)
సభలో బాలయ్య విజిల్
తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఈరోజు వరకూ స్పీకర్ సస్పెండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఈరోజు వరకూ స్పీకర్ సస్పెండ్ చేశారు. సభకు పదే పదే అంతరాయం కలిగిస్తుండటంతో ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.
అంబటి కౌంటర్...
అయితే ఈరోజు సభలో బాలకృష్ణ విజిల్ వేస్తూ కన్పించారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి ఆయన విజిల్ వేస్తుండటం కనిపించింది. దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ బాలకృష్ణ ఇంటికి వెళ్లి విజిల్ వేసుకునే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. చంద్రబాబు సీటులో కూర్చోవాలని, అప్పుడే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని అంబటి వ్యాఖ్యానించారు. సభ్యులు సస్పెండ్ కావడంతో మిగిలిన టీడీపీ సభ్యులంతా సభను వదలి వెళ్లిపోయారు. ప్రస్తుతం సభా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Next Story

