Wed Dec 24 2025 04:01:27 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాల, మార్కాపురం వాసులకు తీపికబురు
నంద్యాల - మార్కాపురం వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది

నంద్యాల - మార్కాపురం వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నంద్యాల మీదుగా గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ మధ్య నూతన ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు పాసింజర్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు నంద్యాల మీదుగా ప్రయాణిస్తుంది. రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటు లోకి రానున్నాయి. రైలు నం. 57407/ 57408 గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీసు యొక్క ప్రతిపాదిత సమయాలను కూడా ప్రకటించింది.
విద్యార్థులు.. వ్యాపారులకు...
ఈ రైళ్లు మార్గ మధ్యంలో మద్దికెర, పెండేకల్లు, డోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం మరియు తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.ఈ నూతన ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం ద్వారా గుంతకల్లు మరియు మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరడమేకాకుండా మార్గ మధ్యంలోని నంద్యాల, గిద్దలూరు, కంభం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రైలు విద్యార్థులకు, వ్యాపారస్థులకు మరియు ఇతర ప్రయాణికులకు పైన పేర్కొన్న స్టేషన్లకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.
Next Story

