Fri Mar 29 2024 06:33:25 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామపై మరో కేసు నమోదు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది. ఆయన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను అసభ్య పదజాలంతో దూషించాడన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రఘురామ కృష్ణరాజు ఇంటికి వచ్చారు. ఆయనకు 13వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. తాను 13వ తేదీ రాలేనని, పండగ ఉందని చెప్పడంతో 17వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చి వెళ్లారు.
అనుచిత వ్యాఖ్యలు...
అయితే ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు సీఐడీ అధికారి సునీల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సీఐడీ సునీల్ కుమార్ సొంత గ్రామమైన చింతలపూడిలో గొంది రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. ఈ నెల 17వ తేదీన రఘురామ కృష్ణరాజు సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Next Story