Sun Mar 15 2026 19:15:16 GMT+0530 (India Standard Time)
మొండి కేస్తే ముడిపడుతుందా?
ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. పరిస్థిితి చేజారిపోక ముందే ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ముగించేందుకు సహకరించాలని కోరారు. చర్చలకు రమ్మని తామే కోరుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయినా చర్చలకు రాకుండా మొండికి వేయడం తగదన్నారు.
చర్చలకు వస్తేనే కదా?
కమిటీలో చర్చిస్తేనే కదా? అసలు సమస్య ఏంటో తెలిసేది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ కమిటీ పరిధిలో లేని అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఉద్యోగ సంఘాల నేతలు మొండికేయడం తగదన్నారు. తాము చర్చల కోసం ప్రతి రోజూ సచివాలయంలో వేచి చూస్తూనే ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story

