Fri Jan 30 2026 10:25:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుమలలో రష్?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. కంపార్ట్మెంట్లలో వేచి చూడకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో వేచి చూడకుండా నేరుగా శ్రీవారి దర్శనానికి వెళుతున్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేవించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,535 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరలో 24,349 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

