Fri Dec 05 2025 22:37:13 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు శ్రీవారి దర్శనం సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈరోజు ఉదయం క్యూలైన్ టీబీసీ కాంప్లెక్స్ వరకూ ఉంది. దీంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. ఆదివారం కావడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా ఎక్కువగా వచ్చారని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 84,885 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,221 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్ల రూపాయలు ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, క్యూ లైన్ల ఉన్న వారికి అన్నప్రసాదంతో పాటు మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు.
Next Story

