Fri Jan 30 2026 07:29:07 GMT+0000 (Coordinated Universal Time)
నేరుగా దర్శనం.. రష్ లేదు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వరస సెలవులు ముగియడంతో భక్తులు కూడా పెద్దగా తిరుమలలో కనిపించడం లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వరస సెలవులు ముగియడంతో భక్తులు కూడా పెద్దగా తిరుమలలో కనిపించడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉండకుండానే నేరుగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు వెళుతున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోని భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్లో ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటలలోపు పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,201 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28,587 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

