Fri Jan 30 2026 17:28:23 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు తిరుమలలో రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి ఉత్తర ద్వార దర్శనాన్ని తిరుమలలో అమలు చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి ఉత్తర ద్వార దర్శనాన్ని తిరుమలలో అమలు చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతివ్వడంతో భక్తులు ఉత్తర ద్వారం నుంచే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. టిక్కెట్లను ముందుగానే విక్రయిస్తుండటంతో భక్తులు వాటిని కొనుగోలు చేసి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న విడుదల చేసిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లు క్షణాల్లో అమ్ముడుబోయాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ మూడు వందల రూపాయల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. నిన్న తిరుమల శ్రీవారిని 56,003 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 20,365 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

