Fri Jan 30 2026 17:28:32 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు తిరుమలలో రష్...?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పండగ సెలవులు వరసగా రావడంతో భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసి పోయింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. పండగ సెలవులు వరసగా రావడంతో భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసి పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి దర్శనం సమయం 16 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పటికిప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లోకి వచ్చే వారికి మరికొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,804 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 29,615 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

