Thu May 02 2024 05:17:43 GMT+0000 (Coordinated Universal Time)
రద్దీ అంతగా లేదు... కారణమిదే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఐదు గంటల సమయం, నడకదారిన వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయంలో లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించే భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం రెండు నుంచి మూడు గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,953 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 30,579 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story