Fri Jan 30 2026 08:57:02 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో వేచి ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదిహేను కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
శీఘ్ర దర్శనం...
మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,086 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,832 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రానున్న మూడు నెలలు విపరీతమైన రద్దీ ఉంటుందని ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వవద్దంటూ టీటీడీ కోరింది.
Next Story

