Fri Jan 30 2026 10:25:09 GMT+0000 (Coordinated Universal Time)
రద్దీ ఎప్పటిలాగానే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు ఉదయం ఏడు గంటల సమయంలో క్యూ లైన్ లో ప్రవేశించిన వారికి శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఆన్లైన్ లో...
ఈరోజు శ్రీవాణి టిక్కెట్లను ఆన్ లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది. అలాగే నిన్న తిరుమల శ్రీవారిని 53,146 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,655 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

