Fri Jan 30 2026 19:46:49 GMT+0000 (Coordinated Universal Time)
అదే రద్దీ.. తగ్గని దర్శన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులకు స్వామి వారి దర్శనం కోసం 30 గంటల సమయం పడుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి కేటాయించన ప్రకారం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,145 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,411 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

