Sat Jan 31 2026 07:20:05 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల క్యూ లైన్ ఇంత దూరమా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సెలవులు పూర్తయినా భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సెలవులు పూర్తయినా భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వైకుంఠం క్యా కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలా తోరణం వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.
శ్రీవారిని...
నిన్న తిరుమల శ్రీవారిని 77,956 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,672 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

