Fri Jan 30 2026 13:24:20 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో ఈరోజు రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే స్వామి వారి దర్శనం కోసం వెళ్లే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
అత్యధికంగా ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లో స్వామి వారి దర్శనం అవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,387 మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారుక. వీరిలో 24,701 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.71 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

