Fri Jan 30 2026 07:29:07 GMT+0000 (Coordinated Universal Time)
హుండీ ఆదాయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఐదు గంటల దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లో ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శన సమయం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,781 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,552 మండి భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.16 కోట్ల రూపాయలు వచ్చిందని, చాలా రోజుల తర్వాత అత్యధికంగా ఆదాయం లభించిందని తెలిపారు.
Next Story

