Sat Jan 31 2026 00:13:12 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు కూడా క్యూ లైన్ బయట వరకూ.. ఎంత వరకూ అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత నాలుగైదు రోజుల నుంచి భక్తుల తాకిడి తిరుమలకు ఎక్కువగా ఉంది. ఎండల తీవ్రత తగ్గడంతో పాటు అనేక పరీక్ష ఫలితాలు రావడంతో మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్హౌస్ వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 86,721 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,559 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

