Fri Jan 30 2026 05:52:47 GMT+0000 (Coordinated Universal Time)
రద్దీ అలాగే.. 18 గంటల్లో దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇరవై కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని, నడకదారిన వచ్చిన భక్తులకు నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,183 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,990 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.
Next Story

