Sun May 19 2024 10:04:16 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రష్ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు మాత్రం 24 గంటల సమయం పట్టే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,294 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 31,554 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు.
Next Story