Fri Jan 30 2026 21:11:19 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్మెంట్ లోనే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పట్టే అవకాశముందని అధికారులు అంచనాగా తెలిపారు.
రెండు నుంచి మూడు గంటలు...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 29,195 మంది తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కుు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చిందని వెల్లడించారు.
Next Story

