Fri Dec 19 2025 22:15:15 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శనం సమయం 20 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇక రూ.300లు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లనను కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల వరకూ దర్శన సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 86,793 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,254 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.47 కోట్ల రూపాయలుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వీకెండ్ లో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంది. సోమవారం కొంత భక్తుల రద్దీ తగ్గిందన్నది అధికారులు చెబుతున్న మాట.
Next Story

