Fri Jan 30 2026 05:52:54 GMT+0000 (Coordinated Universal Time)
రష్ తిరుమలలో ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో కొంత తగ్గింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తెలిపారు. టోకెన్లు లేకుండా సర్వదర్శనం క్యూ లైన్లోకి ఈరోజు ఉదయం ఏడుగంటలకు ప్రవేశించిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం రెండు నుంచి మూడు గంటల సమయంలో శ్రీవారి దర్శనం పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,873 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,997 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Next Story

