Sat Jan 31 2026 00:08:36 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ.. ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూలైన్ లోకి ప్రవేశించే వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. భక్తులు అర్థం చేసుకుని టీటీడీతో సహకరించాలని వారు కోరుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,211 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,906 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

