Fri Jan 30 2026 11:54:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుమలలో రద్దీ...?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఐదు గంటల దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం 14 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
ఇక మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్ను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల పాటు శ్రీవారి దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,452 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,390 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

