Fri Jan 30 2026 16:10:25 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనపడుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా కనపడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఇప్పుడు ప్రవేశించే భక్తులకు మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్వనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం దర్శనానికి పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,158 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,090 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

