Tue Mar 17 2026 06:02:27 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండగ
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండగ జరుగుతుంది. ఈనెల 13వ తేదీ వరకూ ఈ పండగ జరుగుతుంది.

నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండగ జరుగుతుంది. ఈనెల 13వ తేదీ వరకూ ఈ పండగ జరుగుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషషీద్ దర్గా వద్ద ఈ రొట్టెల పండగ జరగుతుంది. వివిధ రకాల కోరికలతో వచ్చే వారు రొట్టెలు సమర్పిస్తే తమ కోరికలు నెరవేరతాయని ప్రతీతి. అందుకే నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు.
దేశం నలుమూలల నుంచి.....
కులమతాలతకు అతీతంగా ఈ పండగకు హాజరవుతారు. రొట్టెల పండగను రాష్ట్ర పండగగా ప్రభుత్వం 2015లోనే ప్రకటించింది. లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గా వద్దకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

