Sun Jan 12 2025 22:09:25 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు
ఆంధ్ర్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు
ఆంధ్ర్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి బొత్స చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
శనివారమే కావాల్సి ఉన్నా.....
వాస్తవానికి టెన్త్ ఫలితాలు మొన్న శనివారమే విడుదల కావాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా వేశారు. సాంకేతిక కారణాలని అధికారులు చెబుతున్నప్పటికీ, మంత్రి బొత్స అందుబాటులో లేని కారణంగానే వాయిదా వేశారన్న విమర్శలు కూడా విన్పించాయి. రేపు టెన్త్ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి.
Next Story