Fri Dec 05 2025 18:04:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇంటర్ ఫలితాల విడుదల
ఏపీలో నేడు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు.

ఏపీలో నేడు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు.
ఫస్ట్, సెకండ్ ఇయర్....
మొత్తం 9 లక్షల మందికి పైగానే విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష రాశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు విడుదల చేస్తారని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్పారు. ఫలితాలను విడుదల చేసిన తర్వాత https://examresults.ap.nic.in లో చూసుకోవచ్చు.
Next Story

