Fri Dec 05 2025 23:32:48 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టెన్త్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేస్తారని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది గ్రేడ్ల ద్వారా ఫలితాలు విడుదల చేయరు. కేవలం మార్కులను మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెండేళ్ల తర్వాత....
ఈ ఫలితాలను https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత తొలిసారి ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ టెన్త్ క్లాన్ పరీక్షలు నిర్వహించారు. కొంత ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని అనేక మంది ప్రభుత్వ టీచర్లు, ప్రయివేటు సంస్థల ఉద్యోగులపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ ఏడాది మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Next Story

