Mon Jan 20 2025 14:57:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో టెన్త్ ఫలితాలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు విడుదల కావాల్సిన ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు విడుదల కావాల్సిన ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. తొలుత శనివారం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ పదో తరగతి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది.
సాంకేతిక కారణాలతో....
కొన్ని అనివార్య కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతికపరమైన ఇబ్బందుల తలెత్తడం వల్లనే పదో పరీక్ష ఫలితాలు వాయిదా వేసినట్లు తెలిపారు. అందుకే చివరి నిమిషంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story