Tue Jan 20 2026 11:05:42 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో 500 దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి శాంతిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర

ఏపీలో కరోనా మహమ్మారి శాంతిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15,193 శాంపిళ్లను పరీక్షించగా.. 434 కొత్తకేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 4636 మంది బాధితులు కోలుకున్నారు.
Also Read : పారిశుధ్య సిబ్బందిని ఢీ కొట్టిన కారు.. మహిళ మృతి
ఇప్పటి వరకూ ఏపీలో 23,13,212 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 22,83,788 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,726 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,698గా ఉంది.
Next Story

