Thu Mar 19 2026 20:17:02 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు
తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.

తిరుమలలో రేపు రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. అయితే కోవిడ్ నిబంధనల మేరకు ఈ వేడుకలను జరపాలన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. సప్త వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్య ప్రభ వాహనంతో ప్రారంభమయ్యే వేడుకలు చంద్ర పభ వాహనంతో ముగియనున్నాయి.
ఆర్జిత సేవలను అన్నింటిని....
రేపు తిరులమలలో అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నిన్న శ్రీవారిని 33,737 మంది భక్తులు దర్శించుకున్నారు. పదమూడు వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల ఆదాయం 2.82 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

