Wed Jan 21 2026 02:03:24 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్భవన్ లో రక్షాబంధన్ వేడుకలు
రక్షాబంధన్ వేడుకలను బ్రహ్మకుమారీలు ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ లో నిర్వహించారు

రక్షాబంధన్ వేడుకలను బ్రహ్మకుమారీలు ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ లో నిర్వహించారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన బ్రహ్మకుమారీలు ఆయనకు రాఖీ కట్టి పండగను నిర్వహించారు. విజయవాడకు చెందిన రాజయోగిని బ్రహ్మకుమారి శాంతాదీదీ జీ, పద్మజా బెహన్ లు రాజ్ భవన్ లో రాఖీ పండగను జరిపారు.
గ్లోబల్ సమ్మిట్ లో ....
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు రాజ్ భవన్ లోని ఇతర అధికారులకు రాఖీ కట్టారు. గవర్నర్ ను మౌంట్ అబుకు ఆహ్వానించారు. మౌంట్ అబు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గ్లోబిల్ సమ్మిట్ జరుగుతుందని, అందులో పాల్గొనాలని గవర్నర్ ను బ్రహ్మకుమారీలు ఆహ్వానించారు.
Next Story

