Sat May 18 2024 20:30:31 GMT+0000 (Coordinated Universal Time)
స్టీల్ ప్లాంట్ అమ్మకం లేనట్లే
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం వాయిదా పడినట్లేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకం వాయిదా పడినట్లేనని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందన్న జీవీఎల్ అదే సమయంలో స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ లాభాల్లోకి తెచ్చేందుకు అందరూ ప్రయత్నించాలని జీవీఎల్ నరసింహారావు అన్నారు. పరిశ్రమ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
అలాగని...
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతందన్న ఆందోళన ఇక కార్మికులకు అవసరం లేదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను నిలిపేసిందని తెలిపారు. అయితే అలాగని స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ కార్మికులు భయపడాల్సిన పనిలేదని జీవీఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు.
Next Story