Fri Dec 05 2025 11:59:32 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని టవర్లు.. ముందడుగు పడింది
అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ టవర్ల

అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ టవర్ల నిర్మాణానికి 3,673.43 కోట్ల రూపాయలతో ఎల్-1 బిడ్డర్లకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీని ఆమోదిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల అప్పగింతకు సంబంధించి సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఇప్పటికే ఆమోదం తెలిపింది. 882.47 కోట్ల రూపాయలతో జీఏడీ టవర్ నిర్మాణ పనులను ఎన్సీసీ లిమిటెడ్కు, 1,487.11 కోట్ల రూపాయలతో టవర్స్-1, 2 పనులు షాపూర్జీ అండ్ పల్లోంజీ సంస్థకు, 1,303.85 కోట్ల రూపాయలతో టవర్స్- 3, 4 పనులను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అనుసరిస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా సంస్థలకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సూచించారు. నిబంధనలు అతిక్రమించినా, కార్మికుల భద్రత విషయంలో లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story

